Breaking Newsక్రైంజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా
డిల్లీలో బాంబు పేలుళ్లు.. అక్కడ పోలీసుల విస్తృత తనిఖీలు..!

డిల్లీలో బాంబు పేలుళ్లు.. అక్కడ పోలీసుల విస్తృత తనిఖీలు..!
గోదావరిఖని, మన సాక్షి :
డిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో నగరంలో పోలీస్ లు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పారిశ్రామిక ప్రాంతం లో రద్దీగా ఉండే ప్రాంతాలలో పోలీసులు బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేపట్టారు.
జనసంచారం ఎక్కువగా ఉండే ఏరియాలలో పోలీసులు అడుగడుగునా సోదాలు జరిపారు. గోదావరిఖని బస్టాండ్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ప్రధాన చౌరస్తా, లక్ష్మీ నగర్, ఓల్డ్ అశోక్ థియేటర్ ఏరియా తో పాటు వివిధ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా సోదా చేశారు. దుకాణ సముదాయాల ప్రాంతాల్లో నిలిచి ఉన్న వాహనాలను బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీ లలో ఎస్ ఐ రమేష్, భూమేష్, అనూష తో పాటు పోలీస్ సిబ్బంది, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
Tasildar : తహసిల్దార్ సీరియస్ వార్నింగ్.. తరుగు, తాలు పేరుతో కటింగ్ చేయొద్దు..!
-
Suryapet : మీ మొబైల్ ఫోన్ పోయిందా.. CEIR పోర్టల్ లో నమోదు చేస్తే చాలు దొరికినట్టే..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో పత్తి మూటలతో రోడ్డెక్కిన పత్తి రైతులు..!
-
Alumni : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. 17 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు..!









