Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో ఏసీబీ సోదాలు..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో ఏసీబీ సోదాలు బుధవారం నిర్వహించారు. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసాలలో ఏసీబీ సోదాలు చేపట్టింది.

Miryalaguda : మిర్యాలగూడలో ఏసీబీ సోదాలు..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో ఏసీబీ సోదాలు బుధవారం నిర్వహించారు. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసాలలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఆయన నివాసాల్లో సోదాలు చేపట్టారు. గత నెలలో 60 వేల రూపాయలు లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. పాఠశాలకు అనుమతి విషయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారు. దాంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.
ఇది ఇలా ఉండగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలోని ఆయన నివాసాలలో సోదాలు నిర్వహించారు. మిర్యాలగూడలోని రెండు చోట్ల, మిర్యాలగూడ మండలంలోని దొండవారిగూడెంలో ఆయన బంధువుల నివాసాలలో కూడా సోదాలు చేపట్టారు. సోదాలలో డబ్బు, బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించినట్లు సమాచారం.
MOST READ :
-
Miryalaguda : మిర్యాలగూడ తహసీల్దార్ గా శ్రీనివాసులు..!
-
Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!









