వర్షాకాలం జాగ్రత్త.. విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..!
వర్షాకాలం జాగ్రత్త.. విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..!
సూర్యాపేట రూరల్, మనసాక్షి :
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట మండల పరిధిలోని జాటోత్ తండ ఆవాస ప్రాంతమైన బొజ్య తండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన వాంకుడోత్ నాగు నాయక్ (32 )లలిత దంపతులు సుతారి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అయితే మంగళవారం వర్షం రావడంతో ఇంటి దగ్గరే ఉండి నీటి సంపులో ఉన్న నీటిని తీద్దామని మోటార్ తో మురికి నీరు తీస్తుండగా ప్రమాదవశాత్తు నాగు నాయక్ విద్యుత్తు షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతునికి ఇద్దరు కుమార్తెలు ఒక బాబు ఉన్నారు.
ALSO READ :
దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు..!
BIG BREAKING : నల్లగొండ జిల్లాలో.. సాగర్ వరద కాలువకు భారీ గండి..!
తల్లిదండ్రుల కష్టానికి ఫలితం.. అన్నా చెల్లెలు కు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు..!









