Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిర్మల జిల్లా
BIG BREAKING: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా బైoసా పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.

BIG BREAKING: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!
మనసాక్షి వెబ్ డెస్క్:
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా బైoసా పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. బైసా బస్ డిపో సమీపంలో కారు, కంటైనర్ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడక్కడ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతులు నిర్మల్ జిల్లా కుబేర్ మండలం కుప్తి గ్రామానికి చెందినవారుగా సమాచారం. మృతులు బాబన్న , భోజన పటేల్, రాజన్న, వికాస్ గా గుర్తించారు. మీరు హైదరాబాదు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. కారు అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
MOST READ
-
Narayanpet : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ప్రతి ఇంటికి త్రాగునీరు..!
-
Gold Price : బంగారం ఇక కొనలేమా.. ఒక్కరోజులో రూ.22,500.. ఈరోజు తులం ఎంతంటే..!
-
TG News : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు ఇంచార్జ్ బాధ్యతలు.. మన జిల్లాకు వీరే..!
-
Software Engineers : పోటీపడి బీర్లు తాగిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. చివరకు..!









