జాతీయంBreaking Newsరాజకీయం

Elections : దేశవ్యాప్తంగా బిజెపి ప్రభంజనం.. జార్ఖండ్ లో కాంగ్రెస్ గెలుపు..!

Elections : దేశవ్యాప్తంగా బిజెపి ప్రభంజనం.. జార్ఖండ్ లో కాంగ్రెస్ గెలుపు..!

మన సాక్షి :

దేశ వ్యాప్తంగా జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి (ఎన్ డి ఏ) ప్రభంజనం కొనసాగింది. మహారాష్ట్రలో మహా యతి కూటమి 288 స్థానాలకు గాను 230 స్థానాలకు పైగా విజయం సాధించింది. అదేవిధంగా దేశంలోని 14 రాష్ట్రాలలో 46 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 48 అసెంబ్లీ స్థానాలు, రెండు లోకసభ స్థానాలకు ఎన్నికలు ప్రకటించగా రెండు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

జార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్ అంజనాలు తలకిందులు అయ్యాయి. కాంగ్రెస్, జె ఎంఎం కూటమి విజయం సాధించింది. జార్ఖండ్ లో బిజెపికి ఓటమి తప్పలేదు.

అదే విధంగా వాయనాడ్ లోకసభ స్థానంలో ప్రియాంక గాంధీ చరిత్రాత్మక విజయం సాధించింది. ఆమె రాహుల్ గాంధీ మెజారిటీని కూడా రికార్డు బ్రేక్ చేసింది. ఏకంగా నాలుగు లక్షల ఓట్లకు పై చీకు విజయం సాధించింది. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. భారీ మెజార్టీతో విజయం సాధించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగింది.

MOST READ : 

మరిన్ని వార్తలు