తెలంగాణBreaking Newsకామారెడ్డి జిల్లాజిల్లా వార్తలు
గ్రామపంచాయతీ రికార్డులు తనిఖీ చేసిన డిఎల్పిఓ..!
గ్రామపంచాయతీ రికార్డులు తనిఖీ చేసిన డిఎల్పిఓ..!
నాగిరెడ్డిపేట్, మనసాక్షి:
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని బెజ్గం చెరువు తండా గ్రామపంచాయతీనీ ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్ తనిఖీ చేసి గ్రామపంచాయతీ రికార్డ్స్ మరియు నర్సరీ శానిటేషన్ పనులు పరిశీలించి నర్సరీ పల్లె ప్రకృతి వనంలలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని గ్రామంలోని పరిసరాలు దుర్వాసన వెదజల్లకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు.
గ్రామస్తులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సంబంధించిన కార్యదర్శికి వివరించారు.ఆయన వెంట కార్యదర్శి అనిత ఉన్నారు.









