మిర్యాలగూడ : బహిరంగ ప్రదేశాలలో మద్యపానం.. 10 మంది అరెస్టు..!
మిర్యాలగూడ : బహిరంగ ప్రదేశాలలో మద్యపానం.. 10 మంది అరెస్టు..!
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి :
బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తే కఠిన చర్యలు తప్పని మిర్యాలగూడ టూ టౌన్ సీఐ నాగార్జున హెచ్చరించారు. రాత్రి వేళ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న పదిమందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేయడంతో పాటు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే సహించేది లేదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, మద్యం సేవిస్తే 100 ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు.రాత్రి వేళలో రోడ్లపై హల్ చల్ చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.
ALSO READ :
Nagarjunasagar : సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు.. ఇన్ ఫ్లో 1.44 లక్షల క్యూసెక్కులు.. Latest Update
Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!









