Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్నగర్
ఇంటర్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య..!
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని అన్న సాగర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

ఇంటర్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య..!
మన సాక్షి, వెబ్ డెస్క్
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని అన్న సాగర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జక్కుల శ్రావణి (16) విద్యార్థిని భూత్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఇటీవల పరీక్షలు రాసింది. ఆదివారం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శ్రావణి ఫెయిల్ అయింది. దాంతో మానసిక వేదన చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపిస్తున్నారు.









