Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలును సవ్యంగా పూర్తి చేయాలి..!

Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలును సవ్యంగా పూర్తి చేయాలి..!

నల్లగొండ, మన సాక్షి :

అధికారులు, రైస్ మిల్లర్లు రాత్రి, పగలు పనిచేసి ధాన్యం కొనుగోలును సవ్యంగా పూర్తిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ధాన్యం, పత్తి సేకరణ, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. అకాల వర్షాలు, తుఫాన్ వల్ల ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు.

ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున, అవసరమైతే లైట్లు ఏర్పాటు చేసి రాత్రి, పగలు ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. వచ్చే నెల రోజులపాటు కొనుగోలు కేంద్రాలకు దాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ధాన్యం సేకరణను పూర్తిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని, మిల్లర్లు రైతులను ఏలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని, ఈ విషయంలో రైతులకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తేమ, తరుగు, తాలు వంటి విషయాలతో రైతులను సతాయించవద్దని ఆయన కోరారు. ఎండలు బాగా వస్తున్నందున రైతులు పగటిపూట ధాన్యాన్ని అరబెట్టుకోవాలని, సరైన తేమ వచ్చిన వెంటనే అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లను, ప్యాడి క్లీనర్లు, తేమ యంత్రాలను ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు టపాలిన్లను తెప్పించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాలు, మిల్లులలో నైట్ షిఫ్ట్లు ఏర్పాటు చేసి హమాలీలు పనిచేసే విధంగా చూడాలని , రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా ధాన్యం సేకరణలో రెండవ స్థానం పొందినని, దీన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలును సవ్యంగా చేయాల్సిందిగా కోరారు. పత్తి కొనుగోలపై మంత్రి సమీక్షిస్తూ సీసీఐ నిబంధనల సడలింపు కు సంబంధించి ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని , రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలు ఉన్నామని, పత్తి కొనుగోలు విషయంలో ఇదివరకే మిల్లర్లతో మాట్లాడటం జరిగిందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా అధికారి వెంకటేష్, జిల్లా మేనేజర్ గోపికృష్ణ, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, డిసీఓ పత్యా నాయక్, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, మార్కెటింగ్ ఎడి ఛాయాదేవి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

MOST READ ; 

  1. Godrej : లిటరేచర్ లైవ్.. ప్రతిష్టాత్మక గోద్రేజ్ అవార్డులతో వైభవంగా ముగిసిన ముంబై లిట్‌ఫెస్ట్..!

  2. Nalgonda : వెంకట్ రెడ్డి అన్న.. నాతో ఏం పంచాయితీ ఉంది..? మా పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేయించావు..! 

  3. Miryalaguda : వీరు మామూలోళ్లు కాదు.. మిర్యాలగూడలో గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్..!

  4. Miryalaguda : వీరు మామూలోళ్లు కాదు.. మిర్యాలగూడలో గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్..!

మరిన్ని వార్తలు