District SP : తెలంగాణలో సంచలనం.. పిల్లల అక్రమ రవాణా 13 మంది ముఠా అరెస్టు..!
District SP : తెలంగాణలో సంచలనం.. పిల్లల అక్రమ రవాణా 13 మంది ముఠా అరెస్టు..!
సూర్యాపేట, మనసాక్షి :
పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్టుచేసి
13 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్న సూర్యాపేట ఎస్పీ కే నరసింహ తెలిపారు.
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం నందు కేసు వివరాలు ఎస్పీ నరసింహ వెల్లడించారు..
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పిల్లలను అక్రమంగా దత్తత తీసుకోవడం నేరం అని పిల్లలి లేని వారు దత్తత తీసుకోవడానికి చట్టప్రకారం ముందుకు వెళ్ళాలని కోరారు.పిల్లలి లేని తలిదండ్రులు అడాప్షన్ రిసోర్స్ అథారిటీ కి దరకాస్తు చేసుకుంటే సంభందిత సంస్థ వారు ఎంక్వరి చేసి దత్తత తీసుకోవడానికి అన్నీ అవకాశాలు ఉంటే తల్లిదండ్రులు చట్టప్రకారం దత్తత తీసుకోవచ్చు అని చెప్పారు.
మే 28 తేది న 13 మంది సభ్యులు కలిగిన పిల్లల అక్రమ రవాణా మురాను అరెస్టు చేయడం జరిగినదని సూర్యాపేట & నల్గొండ జిల్లాలకు చెందిన వివిధ గ్రామాల నుండి (07) మంది మగ శిశువులు, (03) మంది ఆడ శిశువులను సంరక్షించడం జరిగినదన్నారు.
టేకుమట్ల (02) బాలురు శిశువులు. సూర్యాపేట పట్టణం (02) బాలికల శిశువులు, పెన్పహాడ్ (01) బాలుర శిశువులు, సూర్యాపేట జిల్లా ఉప్పలపహాడ్ (02) బాలుర శిశువులు, నల్గొండ జిల్లాకు చెందిన చిన్న సూరారం (01) బాలిక శిశువు మరియు హైదరాబాద్ (01) బాలుర శిశువులను రక్షించారు.
పిల్లలందరినీ నల్గొండలోని బాలల సంక్షేమ కేంద్రానికి అప్పగించడము జరిగిందని తెలిపారు.13 మండి నింధితులను రిమాండ్ కు తరలించడం జరిగినది. ప్రధానంగా చూసినట్లైతే సూర్యాపేట పట్టణంలోని యాదగిరి మరియు ఉమా రాణి అనే ఒక వ్యక్తి గుడ్ల పంపిణీ వృత్తిని చేస్తూ పిల్లలు లేని తల్లిదండ్రుల గురించి తెలుసు కొని, ఆడ/మగ శిశువు లను బట్టి వారి కమీషన్ 10 వేల నుండి 2 లక్షల వరకు కలిపి మొత్తు 5 నుండి 10 లక్షల వరకు బేరం కుదుర్చుకొని అక్రమంగా దత్తత తీసుకున్న పిల్లలను వారికి అందజెసేవారు.
పైన పేర్కొన్న గ్రామాలను సందర్శించి, ఏ3 నింధితుల ద్వారా మద్యవర్తిత్వం ద్వారా ఎల్లలు లేని తల్లిదండ్రులకు పిల్లలను అక్రమంగా దత్తత ఇచ్చేవారు, మహారాస్త్ర, గుజరాత్ రస్త్రాల నుండి సంభందం ఉన్నట్లు మూలాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.. ఏ6, ఏ8, ఏ౨. ఏ10, ఏ11 నింధితులపై గతంలో మేడిపల్లి, మునగాల, మంగళగిరి, జనగాం, సి ఐ డి ముంబాయి లలో ఇలాంటి కేసులు ఉన్నాయన్నారు.
నిందితుల అరెస్టు:
మే 28- న ఉదయం అక్రమ దత్తతలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు అక్రమంగా దత్తత తీసుకున్న దత్తత తీసుకున్న ఇద్దరినీ ఆధుపులోకి తీసుకుని వారి ఒప్పుకోలు ఆధారంగా నిందితులు ఏ -1 & ఏ -2 లను అరెస్టు చేయడం జరిగినదన్నారు.
అదే విధంగా అక్రమ దత్తత గురించి చర్చించడానికి శిశువుల అక్రమ రవాణా ముఠా బృందం సూర్యాపేటకు వచ్చారని, వారు ఇప్పుడు సూర్యాపేటలోని హైటెక్ బస్ స్టాండ్లో అందుబాటులో ఉన్నారని తెలుపగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులు ఏ -3 నుండి ఏ -13 వరకు అరెస్టు చేయడం జరిగినదని చెప్పారు.
తదుపరి నెరస్తూలను జె ఎఫ్ సీఎం కోర్టు, సూర్యాపేట ముందు హాజరు పరుచడం జరుగుతుందన్నారు.. ఇంకా ఈ కేసులో దీని వెనుక ఉన్న నింధితులను మరియు వాస్తవ తల్లిదండ్రుల గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ నేతృత్వంలో పై నిందితులను పటుకోవడం లో పత్రిభ కనపర్చిన సి సి ఎస్ సూర్యాపేట పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం. శివ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. రాజశేఖర్, సూర్యాపేట రూరల్ పోలీస్ ఇన్స్పెక్టర్. సి సి ఎస్ ఎస్ ఐ పి. హరి కృష్ణ సూర్యాపేట రూరల్ ఎస్ ఐ బాలు నాయక్, పెన్ పహాడ్ ఎసిఐ కె. గోపి కృష్ణ, చివ్వెంల ఎస్ఐ వి. మహేష్ మరియు సి సి ఎస్ సిబ్బంది లను జిల్లా పోలీస్ అధికారి అభినందిచారు.
ఈ కార్యక్రమం లో ఎస్పీ వెంట డీస్పీ ప్రసన్న కుమార్, సి ఐ రాజశేఖర్, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగటుషణ రావు. ఎస్ ఐ లు బాలు నాయక్, గోపి కృష్ణ, సి సి ఎస్ సిబ్బంది ఉన్నారు.









