Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్యసంగారెడ్డి జిల్లా
MEO : పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఎంఈఓ.. రికార్డులు స్వాధీనం..!
MEO : పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఎంఈఓ.. రికార్డులు స్వాధీనం..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని దెగుల్వాడి ప్రాథమికోన్నత పాఠశాల రికార్డులు మంగళవారం ఎంఈఓ ఎండీ. రహీమొద్దిన్ స్వాధీనం చేసుకున్నారు. ఆయన పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రికార్డులు గత ఆగస్టు నుంచి పత్తా లేకుండా పోయాయి. ప్రభుత్వం మిడ్డే మీల్స్ కోసం పంపిణీ చేసిన సామగ్రికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. పాఠశాలకు రాని రోజుల్లో ఉపాధ్యాయుల హాజరు పట్టికలో స్పెషల్ అధికారులు సిఎల్ రాసిన దానిపై సంతకాలు చేసి బిల్లులు చేసుకున్నట్లు ఎంఈవో ఆకస్మిక పరిశీలనలో తేలింది. దీంతో ఎంఈవో రహీమొద్దీన్ హెచ్ఎం రేఖ రాణి, పై అసహనం వ్యక్తం చేశారు.
MOST READ :
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.. లంచం ఎంతో తెలుసా..!
-
Miryalaguda : రాష్ట్రస్థాయి ఒలంపియాడ్ పరీక్షల్లో శిష్య స్కూల్ విద్యార్థుల ప్రతిభ..!
-
LPG : సామాన్యులపై బండ..!
-
Miryalaguda : అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ పట్టివేత..!
-
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. ఓటీపీ మోసాలకు ఇక చెక్..!









