Miryalaguda : ఫలితాలు ఏవైనా.. ఉద్యోగం ఆమెదే..!
Miryalaguda : ఫలితాలు ఏవైనా.. ఉద్యోగం ఆమెదే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఫలితాలు ఏవైనా ఉద్యోగం రావాల్సిందే. ఇటీవల వెలువడిన అన్ని టిఎస్పిఎస్సి గ్రూప్స్ ఫలితాల్లో అన్ని ఉద్యోగాలు సాధించింది ఆ యువతి.
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామానికి చెందిన పొలగాని నరసింహ గౌడ్ , వెంకాయమ్మ దంపతుల కూతురు శ్వేత. ఒకే సంవత్సరం వరుస ఫలితాలలో Group-1 లో 467 మార్కులు, Group -2 లో 412 ర్యాంక్ స్టేట్, Group-3 లో 272 ర్యాంక్ స్టేట్ సాధించింది. గత 3 నెలల కిందట group 4 ఎంపిక అయిన ఆమె అడవిదేవులపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జాబ్ లో చేరగా వరుస ఫలితాలలో అన్ని జాబ్ లు ఎంపికైంది.
రాష్ట్ర స్థాయి లో అత్యున్నత సర్వీస్ గ్రూప్ 1 లో మంచి మార్కులు పొదడం సంతోషకరం గా వుందని 467 మార్కు లకు మంచి సర్వీస్ ఎంపిక అయ్యే అవకాశం ఉంది. దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్ సాధించడమే లక్ష్యమని మారుమూల గ్రామం లో పుట్టి కుటుంబంలో ఈ విజయాలు సాధించినందుకు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తన ప్రతిభ మీద నమ్మకం ఉంచి విజయానికి కారణమైన తల్లిదండ్రుల ప్రోత్సాహం అని తెలిపింది.









