Suryapet : గాలి వాన బీభత్సం.. నేల వాలిన వరి పంట..!
Suryapet : గాలి వాన బీభత్సం.. నేల వాలిన వరి పంట..!
అనంతగిరి, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో నిన్న రాత్రి కురిసిన వర్షం వల్ల గాలుల బీభత్సానికి విద్యుత్ స్తంభాలు కూడా చాలా చోట్ల నేలకి ఒరిగాయి. అంతేగాక మండలంలోని రోడ్డు ఇరుపక్కలా ఉన్న చెట్లు ఈదురు గాలులు వీచేసరికి రహదారికి ఆటంకంగా మారాయి.
మండలంలోని కొన్ని ప్రాంతాలలో తీగలు వేలాడుతున్న అధికారులు, లైన్మెన్లు పట్టించుకోకపోవడం వల్ల ఆ దారి గుండా వెళ్ళే ప్రయాణికులకు భయాందోళన కలిగిస్తున్నాయి.ఈ సంఘటనలన్నీ త్రిపురవరం, వాయల సింగారం, వసంతపురం, ఖానపురం, అమీనాబాద్ వంటి చాలా గ్రామాలలో చాలా
నిన్న రాత్రి జరిగిన గాలి బీభత్సానికి పరాకాష్టగా ఉన్నాయి.
మండలంలో రంగయ్య గూడెం దగ్గర కాల్వలలో ప్రవహించలిసిన నీరు వర్షపు నీరు తో కలిసి రోడ్డుమీద పారుతున్నాయి.పంట కోసం తీసిన రోడ్డు పక్కన కాల్వలు కూడా పంట పొలంగా చేశారు. ఇలా ఆక్రమణ కు గురై అవ్వడం వల్ల కాల్వల నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నాయి. అన్ని స్థాయి అధికారులు కొంచెం సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Latest Update :
-
Digital Cards : తెలంగాణలో డిజిటల్ కార్డుల పైలట్ సర్వే ప్రారంభం.. ఈ వివరాలు మీ దగ్గర ఉంచుకోండి..!
-
Miryalaguda : మిర్యాలగూడలో ప్లాస్టిక్ కవర్స్ నిషేధించేందుకు ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్..!
-
Digital Cards : తెలంగాణలో డిజిటల్ కార్డుల పైలట్ సర్వే ప్రారంభం.. ఈ వివరాలు మీ దగ్గర ఉంచుకోండి..!









