Sangareddy : రోడ్డు సౌకర్యం లేక దీనస్థితి.. బాలింతను రెండు కిలోమీటర్లు వీపుపై మోసుకెళ్లిన 108 సిబ్బంది.. (వీడియో)

Sangareddy : రోడ్డు సౌకర్యం లేక దీనస్థితి.. బాలింతను రెండు కిలోమీటర్లు వీపుపై మోసుకెళ్లిన 108 సిబ్బంది.. (వీడియో)
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా రోడ్డు లేని తండా.. ఆపై వర్షం.. బాలింతను అంబులెన్స్ వరకు వీపుపై ఈఎంటి మోసిన దీనస్థిథి ఇది.. నాగలిగిద్ద మండలం శాంతినగర్ గ్రామపంచాయతీలోని మున్యాతండాకు చెందిన కౌశిబాయి ప్రసవానికి ఆదివారం 108కు కాల్ చేశారు. అంబులెన్స్ ఈఎంటి సంగ్ శెట్టి మహిళకు పురుడు పోయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
అయితే తండా నుంచి బాలింతను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వర్షంలో 2KMS దూరంలో ఉన్న అంబులెన్స్ వరకు వీపుపై ఇలా మోసుకెల్లారు. దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్న మన దేశం ఇప్పటికీ అభివృద్ధి చెందని దేశం అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం తాండవాసులు అంటున్నారు.
Video:
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు సౌకర్యం లేక అంబులెన్స్ కూడా వెళ్లలేని తండా నుంచి బాలింతను వీపుపై మోసుకెళ్తున్న దృశ్యం pic.twitter.com/zjycDTu241
— Mana Sakshi (@ManaSakshiNews) August 11, 2025
MOST READ :
-
Doctorate : చేవెళ్ళ యువతికి అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ డాక్టరేట్..!
-
Govt Scheme : ఆడపిల్ల పుడితే తల్లికి రూ. 6000.. స్పెషల్ స్కీం.. దరఖాస్తు ఇలా..!
-
Rythu Bheema : రైతు బీమాకు దరఖాస్తులు స్వీకరణ..!
-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారందరికి టికెట్లపై రాయితీ..!
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!









