Nalgonda : మైలసముద్రం చెరువు నుంచి సాగునీటి విడుదల.. ఆనందంలో రైతులు..!
Nalgonda : మైలసముద్రం చెరువు నుంచి సాగునీటి విడుదల.. ఆనందంలో రైతులు..!
కనగల్, మన సాక్షి:
నల్గొండ జిల్లా కనగల్ మండలంలో ప్రధాన నీటి వనరైన కనగల్ మైలసముద్రం చెరువు నుంచి గురువారం నీటిపారుదల శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ఆయకట్టులో యాసంగి సాగు అవసరాల కోసం సాగునీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువు నీటిని వృధా కాకుండా సాగు అవసరాల కోసం వాడుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ బిక్షం యాదవ్, మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు హఫీజుద్దీన్, నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈ ఈ సురేష్, జేఈ శాజియ,
మాజీ సర్పంచ్ లు నర్సింగ్ సునీత కృష్ణయ్య గౌడ్, బోగిరి రాంబాబు, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కరీముల్లా, మాజీ ఉప సర్పంచ్ పెద్దులు, శంకర్, మోహన్, వెంకన్న, లస్కర్లు నరేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక.. లేటెస్ట్ అప్డేట్..!
-
Phone Call : ఈ నెంబర్ల నుంచి ఫోన్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయొద్దు.. అవి ఏంటో తెలుసుకుందాం..!
-
Gold Price : దడ పుట్టిస్తున్న పసిడి ధర.. హ్యాట్రిక్, ఈరోజు తులం ఎంతంటే..!
-
Additional collector : గ్రూప్-2 పరీక్షల అభ్యర్థులకు ఇవి తప్పనిసరిగా ఉండాలి.. అదనపు జిల్లా కలెక్టర్..!









