Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

గ్రీన్ ఫీల్డ్ వద్దని సర్వేను అడ్డుకున్న గిరిజన రైతులు..!

గ్రీన్ ఫీల్డ్ వద్దని సర్వేను అడ్డుకున్న గిరిజన రైతులు..!

ఆమనగల్లు ప్రతినిధి, మనసాక్షి:

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ లోని సాకిబండ తండాలో బుధవారం గ్రీన్ ఫీల్డ్ భూ సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులను రక్షక భటులను తండా గిరిజన రైతులు అడ్డుకొన్నారు.

ఈ సందర్భంగా గిరిజన రైతులకు మద్దతుగా ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పత్య నాయక్ నిలిచి అధికారులతో మాట్లాడుతూ..

మా భూములు మాకు కావాలి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మాకు వద్దుని రైతులు ఆవేదన వెక్తం చేయడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గిరిజన రైతులు మాట్లాడుతూ మేము పంట పండించే మా భూములను కోల్పోమని వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు