Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. దామరచర్లకు చెందిన బాలింత మృతి..!

Nalgonda : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. దామరచర్లకు చెందిన బాలింత మృతి..!

నల్లగొండ, మనసాక్షి:

మాతా శిశు కేంద్రంలో వైద్యం వికటించి ఓ బాలింత మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దామరచర్ల మండలం జైలోతుతండా చెందిన రాజేశ్వరి మొదటికాన్పుకోసం ఆస్పత్రిలో చేరగా శుక్రవారం నాడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శనివారం వైద్యుల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి రాజేశ్వర్ మరణించిందని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా చేశారు.

సమాచారం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు , డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ నాయకులు భూముల మోహన్ రెడ్డి తదితరులు సంఘటనస్థలి అని చేరుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం తో ధర్నాను విరమించారు.

MOST READ :

మరిన్ని వార్తలు