BhoBharati : భూభారతి సదస్సులు.. రేపటి నుంచి ఏ తేదీలలో ఎక్కడ..!

BhoBharati : భూభారతి సదస్సులు.. రేపటి నుంచి ఏ తేదీలలో ఎక్కడ..!
పెన్ పహాడ్, మన సాక్షి ;
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో మంగళవారం నుండి భూ భారతి సదస్సులు ప్రారంభం అవుతున్నాయని తాసిల్దార్ ధారావత్ లాలు నాయక్ సోమవారం మన సాక్షి ప్రతినిధి కి వివరించారు.
ఆయన మాట్లాడుతూ రెవిన్యూ గ్రామాల వారీగా ఈనెల 3 న మంగళవారం మాచారం, నాగులపహాడ్, 4 న లింగాల, అనాజిపురం, 5 న మహమ్మదాపురం, పొట్లపహాడ్, 6 న ధర్మాపురం, దోస పహాడ్, 9 న భక్తాలపురం, సింగారెడ్డి పాలెం, 10 న గాజుల మల్కాపురం, పెన్ పహాడ్, 11 న చిదెళ్ల , అనంతారం, 12న ధూపహాడ్, నాగులపాటి అన్నారం, గ్రామాలలో భూ భారతి పై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తాసిల్దార్ లాలూ నాయక్ తెలిపినారు.
దీర్ఘకాలం నుంచి రైతులకు సంబంధించిన భూ సమస్యలు, రైతులకు భూమిపై హక్కులను, భద్రపరిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం భూ భారతి పేరుతో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తాసిల్దార్ లాలూ నాయక్ తెలిపినారు.









