UPI : యూపీఐ లావాదేవీలపై జిఎస్టి విధింపు పై కేంద్రం క్లారిటీ..!

UPI : యూపీఐ లావాదేవీలపై జిఎస్టి విధింపు పై కేంద్రం క్లారిటీ..!
మన సాక్షి :
యూపీఐ లావాదేవీలు దేశవ్యాప్తంగా రోజురోజుకు ఎక్కువైతున్నాయి. పట్టణాల నుంచి మారుమూల పల్లెల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల డిజిటల్ పేమెంట్స్ పై జిఎస్టి విధిస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
₹2,000 కంటే ఎక్కువ UPI లావాదేవీలపై వస్తు మరియు సేవల పన్ను (GST) విధించడాన్ని ప్రభుత్వం పరిగణించడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2,000 కంటే ఎక్కువ UPI లావాదేవీలపై వస్తు మరియు సేవల పన్ను (GST) విధించడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్న వాదనలు పూర్తిగా తప్పు. ఎటువంటి ఆధారం లేనివి. ప్రస్తుతం ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన లేదని తెలిపింది.
నిర్దిష్ట సాధనాలను ఉపయోగించి చేసే చెల్లింపులకు సంబంధించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వంటి ఛార్జీలపై GST విధించబడుతుంది. జనవరి 2020 నుండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) 30 డిసెంబర్ 2019 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పర్సన్-టు-మర్చంట్ (P2M) UPI లావాదేవీలపై MDRని తీసివేసింది.
ప్రస్తుతం UPI లావాదేవీలపై MDR ఛార్జ్ చేయబడదు కాబట్టి, ఈ లావాదేవీలకు GST వర్తించదు. UPI ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. యూపీఐ లావాదేవీల పై జిఎస్టి విధించే ఆలోచనలో ప్రభుత్వం లేదని స్పష్టం చేసింది.
Similar News ;
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!
-
UPI : భారత్ సొంత చెల్లింపుల యాప్ భీమ్.. పైసోం కా కదర్ పేరుతో కొత్త ప్రచారం..!
-
UPI : యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!
-
UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!









