ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం
ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం
దమ్మపేట టౌన్, మనసాక్షి;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సిపిఐ కార్యాలయం నందు ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవం ముందుగా భారీ ర్యాలీ జెండా ఆవిష్కరణ యార్లగడ్డ ఈశ్వరరావు ఆవిష్కరించారు.
సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న భారతదేశంలో ఆవిర్భావం నుండి అనేక పోరాటాలు పేద ప్రజల కి వేలాది ఎకరాలు లక్షలాది ఇళ్ల కాలనీలు ఇళ్లస్థలాలు సాధించిన ఘనత కార్మికుల పక్షాన కర్షకుల పక్షాన పోరాడిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని ప్రజా సమస్య లు ఉన్నంతకాలం సూర్యచంద్రులు ఉన్నంతకాలం సిపిఐ పార్టీ సజీవంగానే ఉంటుందని రాబోయే కాలంలో ఎర్ర జెండా పాలన వస్తుందని ఈ సందర్భంగా తెలిపినారు.
ALSO READ : BREAKING : షార్ట్ సర్క్యూట్తో ఆటోమొబైల్స్ దగ్ధం..!
మండల వ్యాప్తంగా అన్ని శాఖల్లో జెండా ఆవిష్కరణలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి సుంకిపాక ధర్మ జిల్లా కౌన్సిల్ సభ్యులు తంగేళ్లపూడి శివకృష్ణ, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి బత్తుల సాయి , ఏఐవైఎఫ్ మండల నాయకులు లక్ష్మీనారాయణ, రాపోలు శ్రీమన్నారాయణ, మహిళా సమైక్య నాయకులు ఎస్ కే జాన్ బి, మురళి ఎస్ కే జానీ బేగం, వీరాస్వామి, ప్రసాదు, తోట శ్రీను ప్రసాదు, మిర్యాల వీరలక్ష్మి, గాజు బోయిన కృష్ణవేణి , ఊరుకొండ సుబ్బలక్ష్మి నక్క నాగమణి , ఈశ్వరి , రాధిక , వెంకటేష్ , తిరుపతమ్మ, ఏఐటీయూసీ నల్ల ప్రసాదు, కోకిలంపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : మిర్యాలగూడ : ఎమ్మెల్యే బిఎల్ఆర్ ను పరామర్శించిన జానారెడ్డి..!









