Street Foods: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా.. కేంద్రం హెచ్చరిక..!

Street Foods: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా.. కేంద్రం హెచ్చరిక..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
సమోసాలు, జిలేబీలు, గులాబ్ జామున్లు, వడ పావ్లు.. ఇవి నోరూరించే వీధి ఆహారాలు. ఇవి కనిపిస్తే చాలు వెంటనే తినాలనిపిస్తుంది. అయితే, వీటి విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఓ కీలక హెచ్చరిక వచ్చింది. ఈ రుచికరమైన వంటకాలు సిగరెట్ల మాదిరిగా ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారిగా, నాగ్పూర్లోని ఎయిమ్స్తో సహా ప్రభుత్వ సంస్థలకు ఒక ఆదేశం జారీ చేసింది. రోజువారీ భారతీయ చిరుతిళ్లలో దాగి ఉన్న కొవ్వు, చక్కెర శాతాన్ని స్పష్టం చేసే “ఆయిల్ అండ్ షుగర్ బోర్డులను” ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ స్పష్టమైన, అవగాహన కల్పించే పోస్టర్లు త్వరలో క్యాంటీన్లు, ప్రభుత్వ సంస్థల సాధారణ ప్రాంతాల్లో తప్పనిసరి కానున్నాయి. ఇవి ప్రజలకు అధిక చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలను గుర్తు చేస్తాయి.
సిగరెట్ తరహా హెచ్చరిక
ఈ ప్రయత్నం ఆహార పదార్థాలను నిషేధించడం కోసం కాదు, ప్రజలకు సరైన సమాచారం అందించడమే దీని ఉద్దేశ్యం. ఐదు టీస్పూన్ల చక్కెర ఒక లడ్డూలో ఉందనుకుంటే, గులాబ్ జామూన్లో దాదాపు అంతే చక్కెర ఉంటుంది. మీరు రెండవసారి అలాంటి పదార్థాలు తీసుకునే ముందు ప్రభుత్వం ఈ సమాచారాన్ని మీకు తెలియజేయాలని కోరుకుంటుంది.
కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన అమర్ అమలే మాట్లాడుతూ, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి “కొత్త పొగాకు” అని అభివర్ణించారు. ప్రజలు తమ శరీరంలోకి ఏమి తీసుకుంటున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
MOST READ :
-
Jeera water : జీలకర నీరు తాగితే ఏమవుతుందో తెలుసా.. వెంటనే తెలుసుకోండి..!
-
Eggs : గుడ్లు పాడైన విషయం తెలుసుకోండిలా.. నిల్వ చేయడం ఎలా..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
-
Vaccine : మహిళలకు భారీ శుభవార్త.. ఆ వ్యాక్సిన్తో గర్భాశయ క్యాన్సర్కు చెక్.. అందరికి మేలు..!









