Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Tragedy : తీవ్ర విషాదం.. పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్య..!

పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తీవ్ర విషాదం ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నది. ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో జీయ్యమ్మ మండలం వనజ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Tragedy : తీవ్ర విషాదం.. పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్య..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తీవ్ర విషాదం ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నది.
ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో జీయ్యమ్మ మండలం వనజ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

అదే గ్రామానికి చెందిన మధు, సత్యవతి దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారికి ఏం కష్టం వచ్చిందో.. ఏమో తెలియదు. కానీ గత రాత్రి ఆ కుటుంబ సభ్యులంతా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఆ ఇంటి నుంచి ఎవరూ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా మధు కుటుంబ సభ్యులు మృతి చెంది ఉన్నారు. ఈ ఘటనలో మీనక మధు (35) అతని భార్య సత్యవతి (30) వారి కుమారుడు మోష (4) మృతిచెందగా కుమార్తె అయోష పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడానికి ఆర్థిక ఇబ్బందుల కారణమా..? లేక ఇతర కారణాలా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ 

  1. Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

  2. Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో ఏసీబీ సోదాలు..!

  4. BIG BREAKING: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!

మరిన్ని వార్తలు