Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

TG News : మాజీ మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్.. జూబ్లీహిల్స్ ఓటర్ల నిర్ణయం అదే..!

TG News : మాజీ మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్.. జూబ్లీహిల్స్ ఓటర్ల నిర్ణయం అదే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోందన్నారు.

అన్ని వీడియో, ఫోటో ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి సమర్పించడం జరిగిందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ని కోరామని, కొంతమంది పోలీస్ అధికారులు, ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారన్నారు.

సీ విజిల్ యాప్ లో కంప్లైంట్ కూడా ఇస్తున్నామని, పోలీసు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని, అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు తెలివైన వారని, తగిన రీతిలో కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారన్నారు. ఇంత అధికార దుర్వినియోగం జరుగుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని, అన్ని విషయాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చామన్నారు. సెన్సిటివ్ పోలింగ్ బూతుల్లో కేంద్ర బలగాలను పెట్టాలని, సెన్సిటివ్ బూత్ వివరాలను కమిషన్ కి సమర్పించామని తెలిపారు.

ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను, ఆశా, అంగన్వాడి వర్కర్లను అక్కడ నియమించి లోపలికి వెళ్లే ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే పోలింగ్ బూత్ లోకి అనుమతించాలని కోరామని,
ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ బూతులకు పంపించకూడదన్నారు.

మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ఫేక్ ఓటర్ ఐడీలు తయారు చేశారని, ఫేక్ ఐడి కార్డుల వీడియోను ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించడం జరిగిందన్నారు. ఎలక్షన్ అబ్జర్వర్లకు కూడా కాంగ్రెస్ అధికార దుర్వినియోగము, ఫేక్ ఐడీ కార్డుల వివరాలను అందించామని, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తప్పకుండా అధికారులపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు.

యూసుఫ్ గూడాలో కాంగ్రెస్ కార్యాలయమును ఆనుకొని పోలింగ్ బూత్ ఉందని, కాంగ్రెస్ కార్యాలయం పక్కన పోలింగ్ బూత్ ఎలా పెడతారు. దీనికి సంబంధించి కూడా ఆధారాలను ఎన్నికల కమిషన్ కు ఇచ్చామని,
ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలుగా ఆరు గ్యారెంటీలపై రివ్యూ పెట్టడానికి టైం దొరకలేదని, ఈరోజు 6 గ్యారంటీలపై రివ్యూ పెట్టడం ఎందుకు?

మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని, ఎన్నిసార్లు క్యాబినెట్ సమావేశం జరిగింది. అసెంబ్లీ జరిగింది. అయినా ఆరు గ్యారంటీలపై ఏనాడు రివ్యూ చేయలేదన్నారు.

జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతో ముఖ్యమంత్రి మోకాళ్లపై తిరుగుతున్నాడని, ఈరోజు ఆరు గ్యారెంటీలపై ముఖ్యమంత్రి రివ్యూ చేయడం జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయడమే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా జూబ్లీహిల్స్ ఓటర్లు ముందే నిర్ణయించుకున్నారని అన్నారు.

MOST READ : 

  1. Indiramma Houses : అర్హులకు అందని ఇందిరమ్మ ఇండ్లు..!

  2. Fee : పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూళ్లు.. డీఈఓ ఆదేశాలు బేఖాతర్..!

  3. TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!

  4. Nalgonda : నల్గొండ జిల్లాలో పత్తి మూటలతో రోడ్డెక్కిన పత్తి రైతులు..!

మరిన్ని వార్తలు