Urea : యూరియా కోసం సొసైటీ కార్యాలయం వద్ద క్యూలో వందలాది మంది రైతులు..!

Urea : యూరియా కోసం సొసైటీ కార్యాలయం వద్ద క్యూలో వందలాది మంది రైతులు..!
కామారెడ్డి జిల్లా, మన సాక్షి :
కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయము నుండి వందల మంది, రైతులు క్యూ లైన్ లో చెప్పులు, రాళ్లు పెట్టి గంటల తరబడి వరుసలో నిలబడి ఉన్నారు. సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం, రైతులు గుమ్మి కూడడంతో సంఘటన స్థలాన్ని ఎస్సై ప్రభాకర్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులకు టోకెన్లను పంపిణీ చేయడంతో , రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు.
యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ అధికారులు, పోలీసులతో మాట్లాడారు. సొసైటీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ కు యూరియా టోకెన్ కోసం వెళ్లడం, టోకెన్ తీసుకున్న తర్వాత సొసైటీ గోదాములో యూరియాను తీసుకోవడం ఏమిటని బీఆర్ఎస్ నాయకులు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రైతుకు ఒక యూరియా బస్తాన్ పంపిణీ చేసిన, కొంతమంది రైతులు యూరియా దొరకకపోవడంతో ఇంటికి వెన్ను దిరిగారు.
MOST READ :
-
Nalgonda : రూ.232 కోట్లతో పోలీసు అధికారులకు, సిబ్బందికి క్వార్టర్స్..!
-
MPO : ఆలూర్ ఎంపీఓగా బాధ్యతలు స్వీకరించిన రాజలింగం.. ఎవరో తెలుసా..!
-
Land : భూములు కొంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
-
District collector: కుక్కల దత్తతకు భారీ స్పందన..!
-
District collector : డ్రగ్స్, ధూమపానం, మద్యపానం నిర్మూలనకై అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్..!









