దేవాలయాల్లో రావిచెట్టు, వేపచెట్టు ఎందుకు కలిసి ఉంటాయో.. తెలుసుకుందామా..!
దేవాలయాల్లో రావిచెట్టు, వేపచెట్టు ఎందుకు కలిసి ఉంటాయో.. తెలుసుకుందామా..!
మనసాక్షి:
రావిచెట్టుకి అశ్వత్థవృక్షం అని, బోధివృక్షం అని పేర్లు ఉన్నాయి. చాలా చోట్ల దేవాలయం లల్లో రావిచెట్టు, వేపచెట్టు కలసి ఉంటాయి. ఎక్కువ చోట్ల రావి, వేప చెట్లు కలిపి ఉంటాయి. రావిచెట్టు పురుషునిగాను, వేపచెట్టు స్త్రీగాను భావించి హిందువులు ఎక్కువగా పూజిస్తారు. రావిచెట్టును విష్ణు స్వరూపంగా, వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణలు చేస్తుంటారు.
ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషములు ఉంటే అవి పరిష్కారం అయ్యి సంసారం అన్యోన్యంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అది హిందువులకు నమ్మకం. రావిచెట్టు గురించి పద్మపురాణంలో వివరించి ఉంది. రావిచెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమే అని ఆగమశాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఇదే విషయాన్ని స్కంద పురాణం కూడా చెబుతుంది. అందుకే శ్రీకృష్ణుని వటపత్రశాయి అని కూడా అంటారు.
పిల్లలకి చిన్నప్పుడు పడుకోపెట్టడానికి జోలపాడేవారు. అపాటలో వటపత్రశాయికి వరహాల లాలి అని పాడుతూ నిద్రపుచ్చేవారు. ఇప్పుడు తల్లులు అటువంటి పాటలు పాడటం లేదు. రామాయణం, భాగవతం కధలు చెప్పడం లేదు. పాత తరం పాత తరమే. ఆరోజులు మళ్ళీ రావాలని కోరుకుందాం.
రావిచెట్టు :
జోతిశ్య శాస్త్రంలో రావిచెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. శనిదోషం పోవాలంటే ప్రతిరోజు రావిచెట్టు నీడన నిలబడాలి. రావిచెట్టుకి నమస్కారం చెయ్యాలి. రావిచెట్టుని హత్తుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే శనిదోషం తొలుగుతుందని శాస్త్రం. రావిచెట్టు కొమ్మలతో యజ్ఞ యాగాల చేస్తారు..!సన్యాసులు రావిచెట్టు కర్రను దండంగా చేసుకుంటారు. రావిచెట్టు నీడన కొంచం సేపు కూర్చుంటే బీపీ తగ్గుతుంది.
రావిచెట్టు గాలి మంచి ఆలోచనలు కలిగిస్తుంది. శుద్దోధనుని కుమారుడైన సిద్దార్ధుడు, ఎన్నో సంవత్సరాలు ఎందరినో సేవించిన కలగని జ్ఞానోదయం,రావిచెట్టు కింద విశ్రమించిన తరువాత మహాజ్ఞానోదయం కలిగి బుద్ధుడు అయ్యాడు. అందువల్లనే రావిచెట్టును బోధివృక్షం అంటారు. బౌద్ధ మతస్థులకు రావిచెట్టు మహాపవిత్రమైనది. శ్రీకృష్ణుడు చివరిదశలో రావిచెట్టు క్రిందనే ప్రాణత్యాగం చేశాడు అని శాస్త్రాలలో కూడా ఉంది. రావిచెట్టు ఆడ, మగ, పువ్వులు, కాయలు రెండు కాస్తాయి.
వేపచెట్టు :
వేపచెట్టు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అద్భుతమైన చెట్టు. వేప చెట్టు ఆకులను ఎన్నో రోగాలకు మందుగా వాడుతున్నారు.వేప చెట్టు గాలికి, ఎన్నో రోగాలు,క్రిములు నశింపచేసే గుణంఉన్నది. వేపాకులను నీటిలో వేసి మరిగించి తాగినా,స్నానం చేసినా అనేక రోగాలు పోతాయి.అందుకే ఉగాది ముందురోజులలో పొంగు చూపినవారిని వేపాకులపై పడుకోబడతారు.
అమ్మవార్లకు వేపాకు బాగా ఇష్టం. అందుకే జాతర్ల సమయంలో వేపాకు ఎక్కువగా వాడతారు.
వేపచెట్టు వంటి దివ్య ఔషద వృక్షం భూలోకంలో మరొకటి లేదు. ఇంతకు ముందు ప్రతి ఇంటిదగ్గర వేప చెట్టు ఉండేది. ఇప్పుడు ఎక్కడో ఒకటీ కనిపిస్తుంది.మన హిందూ సంప్రదాయాలలో ప్రతిఒకటి అద్భుతమే, ప్రతి ఒక్కటీ జీవనవిధానానికి సంబంధించినవే.
Reporting : Muthyam Raju, Suryapet
MOST READ :
-
గ్రామ పంచాయతీ కార్యదర్శిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు.. రికార్డులను పరిశీలించిన డిఎల్పివో..!
-
District Collector : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం.. భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ.. జిల్లా కలెక్టర్..!
-
Inter Exams : ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు.. పకడ్బందీగా నిర్వహించాలి..!
-
Suryapet : నా భర్త నాకు కావాలి.. అత్తింటి ముందు కోడలు ధర్నా..!
-
ACB : ఫోన్ పే ద్వారా లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ సురేష్..!









