జాతీయంBreaking News

Business : ముత్తూట్ ఫిన్‌కార్ప్ రికార్డు లాభాలు.. జైడస్ లైఫ్‌సైన్సెస్ ‘సులభ పరీక్ష’ ప్రచారం..!

Business : ముత్తూట్ ఫిన్‌కార్ప్ రికార్డు లాభాలు.. జైడస్ లైఫ్‌సైన్సెస్ ‘సులభ పరీక్ష’ ప్రచారం..!

ముంబయి/తిరువనంతపురం, మన సాక్షి:

ఆర్థిక సేవల రంగంలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించింది. అదే సమయంలో, ఆరోగ్య రంగంలో జైడస్ లైఫ్‌సైన్సెస్ ‘ది ఈజియెస్ట్ ఎగ్జామ్’ ప్రచారం ద్వారా లక్షలాది మంది మహిళలకి రొమ్ము క్యాన్సర్ అవగాహన కల్పించి ప్రశంసలు పొందింది. ఈ రెండు వార్తలూ భారతీయ మార్కెట్‌లో పురోగతి, సామాజిక బాధ్యతలని చక్కగా చూపుతున్నాయి.

ముత్తూట్ ఫిన్‌కార్ప్ రికార్డు లాభాలు…
138 ఏళ్ల చరిత్ర గల ముత్తూట్ పాపచన్ గ్రూప్ (ముత్తూట్ బ్లూ) లోని ప్రధాన సంస్థ ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్, ఆర్థిక సంవత్సరం 2024-25 (FY25) లో అద్భుతమైన ఆర్థిక పనితీరు చూపింది. సంస్థ నికర లాభంలో 39.86% భారీ వృద్ధిని నమోదు చేసి రూ.787.15 కోట్లకు చేరింది. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.562.81 కోట్ల కన్నా చాలా ఎక్కువ.

సంవత్సరానికి సంబంధించిన ఆదాయం (Y-O-Y రెవెన్యూ) రూ.5,550.53 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4,015.77 కోట్ల నుండి 38.22% వృద్ధిని ఇది సూచిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.66,277.31 కోట్ల పంపిణీలు చేసింది. ఇది సంవత్సరానికి 32.11% వృద్ధిని తెలియజేస్తుంది. ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ ఛైర్మన్ థామస్ జాన్ ముత్తూట్ మాట్లాడుతూ, ఈ గణాంకాలు తమ కస్టమర్ల విశ్వాసం,

సంస్థ లక్ష్యం, ఉద్యోగుల అంకితభావానికి నిదర్శనమని చెప్పారు. తమ నాన్-గోల్డ్ పోర్ట్‌ఫోలియో విస్తరిస్తూ, చాలా మందికి ఆర్థిక సేవలు అందుతున్నాయని ఆయన వివరించారు. సంస్థ వృద్ధి, మూలధన అవసరాలకి మద్దతుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు (NCDలు), ఇతర మార్గాల ద్వారా రూ.8,000 కోట్ల వరకు నిధులని సమీకరించడానికి డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.

రొమ్ము క్యాన్సర్‌పై ప్రజారోగ్య ప్రచారం…
జైడస్ లైఫ్‌సైన్సెస్ దేశవ్యాప్త ప్రచారం ‘ది ఈజియెస్ట్ ఎగ్జామ్’, రొమ్ము క్యాన్సర్‌ని ముందుగా గుర్తించేందుకు స్వీయ-రొమ్ము పరీక్షని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచారం లక్షలాది మందికి చేరి, ఈ సంవత్సరం అత్యంత ప్రభావవంతమైన ప్రజారోగ్య కార్యక్రమాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భారతదేశంలో ప్రతి 29 మంది మహిళలలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వస్తుంది.

ఇది నేడు భారతీయ మహిళలలో చాలా సాధారణమైన క్యాన్సర్. చాలా కేసులు చివరి దశలలో గుర్తించడటంతో, విజయవంతమైన చికిత్స అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయి. ముందస్తు గుర్తింపు ప్రాణాలని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ చాలా మంది మహిళలు ఈ సాధారణ, ప్రాణాలని కాపాడే స్వీయ-పరీక్ష చేయడానికీ సంకోచిస్తారు.

MOST READ : 

  1. Power Cut : నేడు విద్యుత్ కోత.. ఇవీ వేళలు..!

  2. Miryalaguda : రైతులను సన్మానించిన పూర్వ విద్యార్థులు..!

  3. Suryapet : పాలిసెట్ లో శ్రీజ కు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్.. అభినందించిన జిల్లా ఎస్పీ..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త..!

మరిన్ని వార్తలు