Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

NALGONDA : నల్లగొండ పోలీసుల మిషన్ పరివర్తన్.. గంజాయి మాదక ద్రవ్యాలు సేవించి పట్టుబడిన వారికి సరికొత్త కార్యక్రమం..! 

NALGONDA : నల్లగొండ పోలీసుల మిషన్ పరివర్తన్.. గంజాయి మాదక ద్రవ్యాలు సేవించి పట్టుబడిన వారికి సరికొత్త కార్యక్రమం..! 

నల్లగొండ,  మనసాక్షి
నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయం ట్రాపిక్ ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ నందు జిల్లాలోని మునుగోడు, మిర్యాలగూడ ప్రాంతాలలో గంజాయి సేవించి పట్టుబడిన దాదాపు 50 మంది యువకులకు వారి తల్లితండ్రుల సమక్షంలో మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలు  తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి దుష్పరిణామాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డా.శివ కుమార్ సైక్రియటిస్ట్  చే పునర్వవస్థీకరణ కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి ముక్య ముఖ్య అతిథిలుగా  జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్  హాజరయ్యి మాట్లాడారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో జిల్లా ఎస్పి  మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఒక్క సారి వీటికి బానిసైతే జీవితంలో కోలుకోవడం చాలా కష్టం అవుతుందని అన్నారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లో మాదక ద్రవ్యాల టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని,ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తామని అన్నారు.ఒక్క సారి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తే 6 నెలల వరకు దీని యొక్క ప్రభావం శరీరంలో ఉంటాయని అన్నారు.తెలిసి తెలియక  మొదటి సారిగా సేవించి పట్టుబడినారు కాబట్టి ఇట్టి పునర్వవస్థీకరణ కార్యక్రమం ద్వారా మార్పు కొరకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
వీరికి  ఇంకా 1,2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ టెస్టింగ్ చేయబడతాయని అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మళ్ళీ రెండవ సారి మాదక ద్రవ్యాలు సేవించి పట్టుబడుతే 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని గుర్తు చేశారు. ఒక్క సారి పట్టుబడి జైలుకు వెళ్తే జీవితంలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలకు అనర్హులు అవుతారు అన్నారు. మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు,వాటి వినియోగం పై ఉక్కు పాదం మోపుతామన్నారు. మాదకద్రవ్యాలు అమ్మిన,  సరఫరా,సేవించిన వెంటనే డయల్ 100 గాని వాట్స్ అప్ నంబర్ 8712670266 గాని సంబంధిత పోలీస్ స్టేషన్ కి గాని సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, పోలీసు శాఖ నల్లగొండ జిల్లాను  మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చుటకు మిషన్ పరివర్తన్ కార్యక్రమం ద్వారా గంజాయి కి అలవాటు పడిన వారిని పునర్వవస్థీకరణ ద్వారా మార్పు తీసుకొచ్చి వారిలో నూతన జీవితాన్ని రూపొంచిచేందుకు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని అన్నారు.ఈ మాదకద్రవ్యాలకు బానిస కావడం వల్ల యువత జీవితాన్ని కోల్పోతుందని అన్నారు. మనిషి జీవితంలో 15 నుండి 30 సంవత్సరాల లోపు వయసు చాలా ముఖ్యమైనదని, జీవితాన్ని మలుచుకునే ఈ వయసులో  మాదకద్రవ్యాలకు  బానిస కావటం వల్ల జీవితం నాశనం అవుతుందని అన్నారు.
యుక్త వయస్సులో కుటుంబాన్ని అండగా ఉండలని అన్నారు.ప్రపంచంలోని అన్ని జీవుల కంటే మనిషి చాలా తెలివైన వారు అని, అలాంటి దానిని మత్తు పదార్థాలకు సేవించడం వల్ల మెదడుపై దాని యొక్క ప్రభావం పడడం వల్ల  జంతులాగ మారి పోతుందని అన్నారు.  అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో యువత మాదకద్రవ్యాలకు అలవాటు కావద్దని అన్నారు. గంజాయి సేవించి పట్టుబడి జైలుకు వెళ్తే మీ కుటుంబంలో మరియు సమాజంలో విలువలు కోల్పోతారని అన్నారు.
అలాగే తల్లితండ్రుల తమ పిల్లలు ఏం చేస్తున్నారు ?ఎక్కడ తిరుగుతున్నారనే విషయాలపై  శ్రద్ధ చూపాల్సిన బాధ్యత చాలా ముఖ్యం అన్నారు. పిల్లలు మత్తుకు బానిస కాకుండా  మొదట తల్లిదండ్రుల్లో  అవగాహనరావాలని అన్నారు.  పర్యవేక్షణచేయకపోవడం వల్లే పిల్లలు చెడు వైపు చూస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్పీ రాములు నాయక్,యస్బి డియస్పీ రమేశ్, నల్గొండ డియస్పీ శివరాం రెడ్డి, సిఐలు డానియల్, రవి కుమార్, ఆర్.ఐ సంతోష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 

ALSO READ : 

Cm Revanth Reddy: రైతులకు బిగ్ రిలీఫ్.. రూ.1350 కోట్లతో ఆ పథకం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..!

మిర్యాలగూడ : బహిరంగ ప్రదేశాలలో మద్యపానం.. 10 మంది అరెస్టు..!

BREAKING : ఆర్డిఓతో సహా మరో ఇద్దరు అధికారుల సస్పెండ్..?

Nagarjunasagar : సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు.. ఇన్ ఫ్లో 1.44 లక్షల క్యూసెక్కులు.. Latest Update 

మరిన్ని వార్తలు