Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
నల్గొండBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయం

Nalgonda : నల్గొండ జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

Nalgonda : నల్గొండ జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం..!

కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి – దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్

చింతపల్లి, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలం కేంద్రంలోని మార్కెట్ యార్డులో పిఎసిఎస్ గడియ గౌరారం వారి ఆధ్వర్యంలో సబ్ మార్కెట్ యార్డ్ చింతపల్లిలో క్వింటాల్ కు 8000 చొప్పున కందులు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఏ ఒక్క రైతు నష్టపోకుండా చూసేందుకు వరి, ధాన్యంతో పాటు ఇతర వాణిజ్య పంటలు, కందులు తదితర ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ అధికారులు చెప్పిన నిబంధన ల ప్రకారం రైతులు వారి సూచనలతో తాము పండించిన ధాన్యాన్ని మార్కెట్ కు తరలించి నష్టపోకుండా ఉండాలన్నారు.

అవకాశాన్ని రైతులు సద్వినియోపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, గడియ గౌరవం పిఎసిఎస్ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, జి, రఘునాథ్ రెడ్డి,ఎంపీడీవో సుజాత, తాసిల్దార్ విజయలక్ష్మి, మండల వ్యవసాయశాఖ అధికారిని ఏవో శ్రవణ కుమారి, చింతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, స్థానిక సర్పంచ్ ఆసారం శ్వేతా శ్రీనివాస్, మల్లారెడ్డి పల్లి సర్పంచ్ నల్ల సునీత రఘుమా రెడ్డి, ఉప్పరపల్లి సర్పంచ్ మెండే వెంకటయ్య యాదవ్,

వింజమూర్ సర్పంచ్ యాచారం యాదగిరి గౌడ్, ప్రశాంత పూరి సర్పంచ్, కేతావత్ శ్రీను నాయక్, పోలపల్లి రాంనగర్ సర్పంచ్ దొంతగోని యాదమ్మ, తక్కలపల్లి సర్పంచ్ మేడపు జంగయ్య, కిష్టరాయన్ పల్లి సర్పంచ్ గొడ్డటి సంతోష రమేష్, వరకాల సర్పంచ్ కురుమేటి పుష్పలత, నసర్లపల్లి సర్పంచ్ పంబలి మాలతి వెంకటయ్య, వీరి తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరుకల వెంకటయ్య గౌడ్, ముచ్చర్ల యాదగిరి, కాయ తితేందర్ రెడ్డి, దాసరి శ్రీనివాస్ యాదవ్, ఎల్లంకి కిషన్, ఎండి సిద్ధిక్ బాబా,ఎలిమినేటి నరసింహ పిఎసిఎస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST READ 

  1. TG News : పంచాయతీలకు గుడ్ న్యూస్.. ఆ నిధులు విడుదల..!

  2. జనగామలో ఉద్రిక్తత.. లాటరీ ద్వారా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక..!

  3. జనగామలో ఉద్రిక్తత.. లాటరీ ద్వారా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక..!

  4. TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. వారికి ఖాతాలలో నిధులు జమ..!

మరిన్ని వార్తలు