Hyderabad : ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..!
Hyderabad : ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..!
హైదరాబాద్, మన సాక్షి :
ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కలకలం రేపుతుంది. వివరాల ప్రకారం ఈనెల 18న ట్రావెల్స్ బస్సులో అమ్మాయిలపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 18వ తేదీన కుకట్ పల్లి నుంచి విజయవాడ వెళ్లేందుకు ఓ మహిళ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కింది.
రాత్రి సమయంలో బస్సు ప్రయాణంలో ఉన్న ఆ మహిళ నిద్రలో ఉంది. ఆ సమయంలో మెల్లగా పక్కకు చేరిన యువకుడు అరిస్తే చంపేస్తాను అంటూ బలవంతంగా అత్యాచారంకు పాల్పడ్డాడు. తనపై జరిగిన ఘటన ఆమె ఇంటికి వెళ్ళాక భర్తకు చెప్పింది. కాగా వారిద్దరూ ఆదివారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. దాంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
బాధితుల ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కూకట్ పల్లికి కేసు బదిలీ చేశారు. అయితే ట్రావెల్స్ బస్సులో బుకింగ్ చేసుకున్న వారి ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి :
-
Good News : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..!
-
Miryalaguda : ఆకస్మికంగా హాస్టల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. సిబ్బందిపై ఆగ్రహం..!
-
E pass : ఈ పాస్ లో నమోదు చేయకుండా ఎరువులు విక్రయిస్తే చర్యలు..!
-
iphone 16 : ఫ్లిప్ లో ఐఫోన్ 16, రూ.55 వేల లోపే.. అంత తక్కువ ఎలాగో చూడండి..!
-
ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను ఇంటికి పంపని పాఠశాల యాజమాన్యం.. విద్యార్థి సంఘాల ధర్నా..!









