Cm Revanth Reddy : రేపే బ్యాంకు ఖాతాలో రుణమాఫీ సొమ్ము.. ముహూర్తం ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి..!
Cm Revanth Reddy : రేపే బ్యాంకు ఖాతాలో రుణమాఫీ సొమ్ము.. ముహూర్తం ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి..!
హైదరాబాద్, మన సాక్షి :
రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీ సొమ్ము రేపే (ఈనెల 18వ తేదీన) వారి వారి ఖాతాలలో జమ కానున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. బుధవారం ప్రజాభవన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈనెల 18వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు లక్ష వరకు రుణాలు వారికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకానున్నట్లు తెలిపారు.
ఈనెలాఖరులోగా లక్షన్నర వరకు ఉన్న వారికి రుణమాఫీ అందనున్నాయని, ఆగస్టులో రెండు లక్షల రుణాలు ఉన్న వారికి మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు. గాంధీ కుటుంబం ఇచ్చిన మాట తప్పదని.. రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలలుగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సూచించారు. రైతు రుణాల మాఫీ సందర్భంగా రేపు గ్రామాలలో ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని పేర్కొన్నారు.
ప్రజా భవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…
2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు.
పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ… pic.twitter.com/w7WzITgxZp
— Telangana Congress (@INCTelangana) July 17, 2024
ఇవి కూడా చదవండి :
తెరుచుకున్న ఆల్మట్టి గేట్లు, భారీగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. ఆయకట్టు రైతుల ఆశలు పదిలం..!









