ఆంధ్రప్రదేశ్Breaking Newsరాజకీయం

Vijayawada : బియ్యం మాఫియా పై పెట్టిన శ్రద్ద.. ఆదాని అక్రమ డీలింగ్ పై ఎందుకు పెట్టడం లేదు..!

Vijayawada : బియ్యం మాఫియా పై పెట్టిన శ్రద్ద.. ఆదాని అక్రమ డీలింగ్ పై ఎందుకు పెట్టడం లేదు..!

మన సాక్షి, విజయవాడ :

రేషన్ బియ్యం మాఫియా పై ప్రభుత్వం పెట్టిన నిఘా ఆదాని ఆక్రమ డీలింగ్ పై ఎందుకు పెట్టడం లేదని ఆంధ్ర ప్రదేశ్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషమని, మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడ ? అన్నారు.

బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేక పోతున్నారు? అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా ? మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే , నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా? మీరు కూడా అదానీకి అమ్ముడుపోయారా? తీగ లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా?

నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారు? TDP ప్రతిపక్షంలో ఉండగా.. SECIతో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి అన్నారు. టెండర్లు లేకుండా అదానీకి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. గుజరాత్ లో రూ 1.99 పైసలు దొరికే సోలార్ విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం రూ.2.49 పైసలకు ఎలా కొన్నారని ఉద్యమాలు చేశారు. 25 ఏళ్ల పాటు డీల్ అంటే రాష్ట్ర ప్రజల నెత్తిన లక్ష కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు.

ఇది ప్రజలను అదానీ కోసం నిలువునా దోచి పెట్టడం అని చెప్పారు. ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా హైకోర్టులో కేసు కూడా వేపించారు. తాము అధికారంలో వచ్చాక నిజాలు నిగ్గు తేలుస్తాం అని.. గొప్ప గొప్ప మాటలు చెప్పారు. మరి ఇప్పుడేమైంది చంద్రబాబు ? అని ప్రశ్నించారు అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని, అధికారం దగ్గర పెట్టుకొని, మౌనంగా ఎందుకు ఉన్నారు సార్ ?

అంటే ఆనాడు జగన్ అదానీకి అమ్ముడు పోయారు. ఇప్పుడు మీరు అమ్ముడు పోయారు అనే కదా అర్థం. మిమ్మల్ని కూడా తక్కెడలో అదానీ నిలబెట్టారు అనే కదా అర్థం. చంద్రబాబుని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అదానీ మిమ్మల్ని కొనకపోతే, అదానీ ఒప్పందాలపై ప్రతిపక్షంలో చేసింది నిజమైన ఉద్యమం అయితే, వెంటనే ACB ని మీ పంజరం నుంచి విడుదల చేయండి. రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించండి. తక్షణం అదానీతో చేసుకున్న సోలార్ పవర్ డీల్ ను రద్దు చేయండి.

MOST READ : 

మరిన్ని వార్తలు