Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా
Power Cut : నేడు విద్యుత్ కోత.. ఇవీ వేళలు..!

Power Cut : నేడు విద్యుత్ కోత.. ఇవీ వేళలు..!
మందమర్రి రూరల్, మానసాక్షి :
మంచిర్యాల జిల్లా మందమర్రి పాలచెట్టు ఏరియాలో 33/11 kv సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు ఏఈ ప్రభాకర్ తెలిపారు. ఆ సబ్ స్టేషన్ పరిధిలోని శంకర్ పల్లి, సండ్రన్ పల్లి, పోన్నారం, వెంకటాపూర్, దుబ్బపల్లి, సారంగపల్లి, చిర్రకుంట, ఆదిల్ పేట్, మొదలగు గ్రామాలకు 28-05-2025 బుధవారం రోజున 33 kv line విద్యుత్ మరమ్మత్తుల కారణంగా ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగును. కావున ప్రజలు సహకరించ గలరని.ఏ. ఈ.ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలియజేసారు.









