పండుగ పూట విషాదం.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..!
పండగపూట కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాల్సిన వేళ ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామానికి చెందిన రాజు ముద్దమల్ల (30) అక్కడికక్కడే మృతి చెందారు.

పండుగ పూట విషాదం.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..!
వెల్దండ, మన సాక్షి:
పండగపూట కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాల్సిన వేళ ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామానికి చెందిన రాజు ముద్దమల్ల (30) అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రక్కు హైదరాబాద్ నుండి కల్వకుర్తి వైపు వెళ్తుండగా, ఇదే సమయంలో కల్వకుర్తి నుండి హైదరాబాద్ వైపు ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనంపై రాజు ప్రయాణిస్తున్నారు. మార్గ మధ్యలో పెద్దాపూర్ గ్రామ శివారులో శాంతి గుట్ట వద్ద ట్రక్కు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రాజు ఎక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
MOST READ :
-
Post Office : లక్షకు రెండు లక్షలు.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీం, కేంద్రం మద్దతు గ్యారెంటీ రిటర్న్స్..!
-
Big Alert : హైదరాబాద్ వెళ్లే వాహనాల దారి మళ్లింపు.. ట్రాఫిక్ రద్దీ తో ప్రత్యామ్నాయ మార్గాలు..!
-
Sankranti Special : రాజమండ్రికి మించిన మర్యాద.. కొత్త అల్లుడికి 158 వంటకాలతో సంక్రాంతి విందు..!
-
సంక్రాంతి వేళ.. కోడిపందాల్లో రికార్డ్, రూ.1.53 కోట్ల భారీ పందెం..!
-
ప్రేమ పెళ్లి పై సుప్రీంకోర్టు జస్టిస్ కీలక వ్యాఖ్యలు..!
-
అందమైన ఫోటోలతో ఆకర్షించి హానీ ట్రాప్.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, కిలాడీ భార్యాభర్తల అరెస్ట్..!









