Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి..!
Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి..!
నేలకొండపల్లి, మన సాక్షి :
నేలకొండపల్లి సమీపంలోని కొరటేను మూలమలుపు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
కొరట్ల గూడెం గ్రామానికి చెందిన బచ్చలకూరి మనోజ్ (18), సన్నీ ప్రసాద్ (17) ద్విచక్ర వాహనంపై నేలకొండపల్లి నుండి స్వగ్రామమైన కొట్లగూడెంకు ద్విచక్ర వాహనం పై వెళుతుండగా మార్గమధ్యం లో గల కొరటేను మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరొక ద్విచక్ర వాహనం బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
మృతి చెందిన ఇద్దరు యువకుల మృతదేహాలను పోస్టుమార్టంని మొత్తం నేలకొండపల్లి పోలీసులు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :









