తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Employees : మేం లంచం తీసుకోం.. ఉద్యోగులు వినూత్న కార్యక్రమం..!

Employees : మేం లంచం తీసుకోం.. ఉద్యోగులు వినూత్న కార్యక్రమం..!

సూర్యాపేట, మనసాక్షి :

ట్రాన్స్ కో కార్యాలయంలో విజిలెన్స్ విభాగం ఆద్వర్యంలో మంగళవారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. మేం లంచం తీసుకోం.. నిస్వార్ధంగా విధులు నిర్వహిస్తాం అని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా మంగళవారం సూర్యాపేట ఎస్ఈ ఆఫీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా టెక్నికల్ డీఈ గాలి నాయుడు, విజిలెన్స్ సిఐ డి.లింగయ్య మాట్లాడుతూ ఎవరైనా సరే లంచం తీసుకోవడం నేరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మహేందర్, దుర్గాప్రసాద్, ఉపేందర్, మధు, ఎస్ఈ ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు