Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్
Rajendranagar : రాజేంద్రనగర్ లో మహిళ డెడ్ బాడీ కలకలం..!

Rajendranagar : రాజేంద్రనగర్ లో మహిళ డెడ్ బాడీ కలకలం..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ లో మహిళ డెడ్ బాడీ కలకలం రేపింది. గుర్తు తెలియని మహిళలను హత్య చేసి బ్రిడ్జి కింద పడేసి వెళ్లిపోయిన దుండగులు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పలు ఆధారాలు స్వేకరించారు.
సీఐ క్యాస్ట్రో మాట్లాడుతూ… కిస్మత్పూర్ లోని బ్రిడ్జ్ కింద మహిళ (35) మృతదేహాన్ని తీసుకోవచ్చి ఇక్కడ పాడేసినట్లు తెలిపారు. అయితే నగ్నంగా పడి ఉందని గాయలు కూడా ఉన్నట్లు తెలిపారు. మృతదేహన్ని మూడు రోజుల కింద పడేసినట్లు తెలుస్తుందని అన్నారు. పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదు అయ్యాయా చుస్తున్నామని సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నామని త్వరలోనే నిందితులని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
MOST READ :









