క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Devarakonda : హత్య చేశారు ఆత్మహత్యగా చిత్రీకరించారు.. జాతీయ రహదారిపై మృతుడి బంధువుల ధర్నా..!

Devarakonda : హత్య చేశారు ఆత్మహత్యగా చిత్రీకరించారు.. జాతీయ రహదారిపై మృతుడి బంధువుల ధర్నా..!

దేవరకొండ, మనసాక్షి :

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన పీఏ పల్లి మండలం పెద్దగుమ్మడంలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటయ్య(35) మంగళవారం ఊరు చివరన గల తోటలో మామిడి చెట్టుకు ఉరి వేసుకొని విగతజీవిగా వేలాడుతూ ఉన్నాడు.

మధ్యాహ్నం తోట యాజమాని వెంకటమ్మ గమనించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దేవరకొండ పట్టణంలో 167 కోదాడ జెడ్చెర్ల జాతీయా రహదారిపై మృత్తుల బంధువులు ధర్న నిర్వహించడం జరిగింది. వెంకటయ్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు భారీగా ధర్నా చేశారు. గంట పాటు స్థబించిన వాహనాలు ఎక్కడికి అక్కడనే నిలిచిపోవడం జరిగింది. తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు.

MOST READ : 

మరిన్ని వార్తలు