ముక్కోటి వేళ.. దేవాలయాలకు పోటేత్తిన భక్త కోటి..!
వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలన్నీ భక్తుల గోవిందా గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.

ముక్కోటి వేళ.. దేవాలయాలకు పోటేత్తిన భక్త కోటి..!
భీంగల్, మన సాక్షి :
వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలన్నీ భక్తుల గోవిందా గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆర్థరాత్రి నుంచే పలు దేవాలయాల వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.భీంగల్ మండలం చేంగల్ గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు.
ఉదయం 5 గంటల నుంచే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు చేరుకుని స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తుల కిటకిటలతో గ్రామం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
MOST READ :.
WhatsApp : వాట్సాప్లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!
Ration Card| రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. షాపుకు వెళ్లాల్సిన పనిలేదు..!









