క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

Nizamabad : నిజామాబాద్ నగరంలో దారుణం.. కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపిన దొంగ..!

Nizamabad : నిజామాబాద్ నగరంలో దారుణం.. కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపిన దొంగ..!

నిజామాబాద్, మన సాక్షి

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పోలీసు కానిస్టేబుల్​ను ఓ నిందితుడు దారుణంగా హతమార్చాడు. కత్తితో ఛాతిలో పొవడంతో కానిస్టేబుల్ కుప్పకూలిపోయాడు. ​ఓ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకొస్తుండగా.. కానిస్టేబుల్​పై అతడు ఎదురు తిరిగి దాడికి దిగాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
నిజామాబాద్​ నగరంలోని నాలుగో ఠాణా పరిధిలో ఉన్న వినాయక్​ నగర్​ ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సీసీఎస్ కానిస్టేబుల్​ ప్రమోద్ దారుణ హత్యకు గురయ్యారు.

పలు కేసుల్లో నిందితుడు : 

నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన రియాజ్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కాగా, అతడిని కానిస్టేబుల్​ ప్రమోద్ అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని బైక్​పై ఎక్కించుకుని ఠాణా కు తరలిస్తుండగా.. వినాయక్​నగర్​ ప్రాంతంలో కానిస్టేబుల్​పై రియాజ్​ దాడి చేశాడు.వెనుక నుంచి ప్రమోద్​పై కత్తితో దాడి చేశాడు. ​మెయిన్​ రోడ్డు పైనే కానిస్టేబుల్​పై నిందితుడు కత్తితో దాడి చేశాడు. ప్రమోద్​ ఛాతిలో కత్తితో పొడిచి పారిపోయాడు.కాగా, తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్​ ప్రమోద్​ రోడ్డుపై కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రమోద్​ను స్థానికులు​ ఆసుపత్రి కి తరలించగా, పరిస్థితి విషమించి ప్రమోద్​ మరణించారు.

రంగంలోకి దిగిన బృందాలు..

కానిస్టేబుల్​ను నిందితుడు చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్​గా తీసుకున్నారు. వెంటనే పోలీసు బృందాలను రంగంలోకి దించారు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

MOST READ : 

  1. TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్..!

  2. Khammam : హోటళ్లు, వ్యాపార సంస్థలో ఆకస్మిక దాడులు.. జరిమానా..!

  3. Narayanpet : అర్దరాత్రి అక్రమంగా తరలిస్తున్న 1100 లీటర్ల డీజిల్ పట్టివేత..!

  4. Apollo : ఖచ్చితమైన ఆయుర్వేద చికిత్స కోసం తెలంగాణలోకి అపోలో ఆయుర్వేద్..!

మరిన్ని వార్తలు