TG News : తెలంగాణలో రైతులకు భారీ శుభవార్త..!

TG News : తెలంగాణలో రైతులకు భారీ శుభవార్త..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణలో రైతులు యూరియా దొరకక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. రోజంతా నిలబడినా ఒక్క బస్తా కూడా దొరకని వైనం నెలకొన్నది. దాంతో రైతుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది.
నిన్న రాష్ట్రానికి 9 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని, ఈరోజు (మంగళవారం) రాత్రి వరకు మరో 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా రానున్నదని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా మరో వారం రోజుల్లో రాష్ట్రానికి 27,473 టన్నుల యూరియా వస్తుందని అధికారులు పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు సూచించారు. అదేవిధంగా వరదల వల్ల జరిగిన నష్టం పై ఐదు రోజుల్లో క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు.
MOST READ :
-
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. వారికి రూ.5 లక్షలు..!
-
Dammapeta : దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి ముంచెత్తిన వరద.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..!
-
Green Banana : పచ్చి అరటికాయ తినొచ్చా.. ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం.. తెలుసుకుందాం..!
-
Banana : తొక్కే కదా అని తీసిపడేస్తున్నారా.. ఏం చేయాలో తెలిస్తే అస్సలూ వదలరు..!
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన అవినీతి అధికారి..!









