BREAKING : డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి..!
BREAKING : డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి..!
మన సాక్షి , వెబ్ డేస్క్ :
గురువారం తెల్లవారుజామున ఓ కారు డివై డర్ ను ఢీకొట్టగా ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా పాల్వంచ లో వివాహానికి హాజరై తిరిగి కారులో నెల్లూరు జిల్లా స్వగ్రామానికి బయలుదేరారు.
కాగా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం కు చేరుకోగానే టంగుటూరు మండలం వద్ద కారు డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. దాంతో కారులో ఉన్న ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులంతా నెల్లూరు జిల్లా కందుకూరు వాసులుగా గుర్తించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన విషాదఛాయలు నింపింది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Related News :
BREAKING : బైక్ ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి..!
Devarakonda : పాదచారుల పైకి దూసుకెళ్లిన కారు ఒకరి మృతి..!
Crime News : ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు..!









