Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Local Body Elections : తొలి దశ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ గౌష్ ఆలం..!

Local Body Elections : తొలి దశ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ గౌష్ ఆలం..!

కరీంనగర్, మనసాక్షిv:

​కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 05 మండలాల్లోని కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్ధంపూర్, చెర్లబూత్కూర్, దుబ్బపల్లి, చామనపల్లి, ఫకీర్ పేట్, జూబ్లీ, నగునూరు పలు పోలింగ్ కేంద్రాలను గురువారం సందర్శిస్తున్నారు.​ ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది పనితీరును, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులకు, సిబ్బందికి సీపీ సూచించారు. ​ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ​తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పర్యవేక్షించడంలో కరీంనగర్ పోలీస్ యంత్రాంగం నిమగ్నమై ఉందని సీపీ ఈ సందర్బంగా తెలిపారు.

MOST VIEWS 

  1. Local Body Elections : ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ధనావత్ లక్ష్మి..!

  2. Nalgonda : జిల్లా ఎస్పీ కీలక సూచన.. పోలింగ్ బూత్ లోకి ఇవి తీసుకెళ్లొద్దు..!

  3. INSURANCE : పోస్టల్ శాఖ భారీ గుడ్ న్యూస్.. రూ.750 చెల్లిస్తే 15 లక్షల ఇన్సూరెన్స్.. ఇలా సద్వినియోగం చేసుకోండి..! 

మరిన్ని వార్తలు