Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా
Adhaar : రైతులకు ఆ సమయంలో ఆధార్ కార్డు వెంట తప్పనిసరి..!

Adhaar : రైతులకు ఆ సమయంలో ఆధార్ కార్డు వెంట తప్పనిసరి..!
సూర్యాపేట, మన సాక్షి :
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఈనామ్ 2.0 ప్రారంభమవుతున్నందున రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు వచ్చేప్పుడు తప్పకుండా ఆధార్ కార్డు, పోన్ నెంబర్ వెంట తెచ్చుకోవాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎం.డి.ఫసీయోద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు.
రైతులు మార్కెట్ యార్డుకు వచ్చినప్పుడు గేట్ ఎంట్రీ చేయించి లాట్ ఐడి తీసుకునేందుకు రైతు పోన్ నెంబర్ తో పాటు ఆధార్ కార్డు తీసుకొచ్చి నమోదు చేయిస్తే లాట్ ఐడి జనరేట్ అవుతుందని లేని పక్షంలో లాటి ఐడి ఇవ్వడానికి వీలు కాదన్నారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కమీషన్ దారులు తమ కల్లంను వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకానికి తీసుకొచ్చే రైతులకు ఫోన్ నెంటర్, ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించాల్సిందిగా కోరారు.
MOST READ :









