Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Fertilizer : ఈ పాస్ యంత్రం ద్వారానే ఎరువులు విక్రయించాలి.. లేదంటే చర్యలు..!

Fertilizer : ఈ పాస్ యంత్రం ద్వారానే ఎరువులు విక్రయించాలి.. లేదంటే చర్యలు..!

మల్లాపూర్, మన సాక్షి :

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సాతారం మల్లాపూర్ మొగిలిపేట్ సిరిపూర్ రాఘవపేట్ గ్రామాలలో ఎరువుల దుకాణాలను జిల్లావ్యవసాయ అధికారి రామచందర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్, ఈపాస్ మిషన్ పరిశీలించారు. డీలర్స్ తప్పనిసరిగా ఎరువులను ఈ పాస్ యంత్రం ద్వారానే అమ్మాలని తెలిపారు.  విత్తనాలు పురుగుమందులు అమ్మేటప్పుడు రైతులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని తెలిపారు.

అలాగే రాఘవపేటలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులు వరి ధాన్యంలో తేమశాతం 17% వచ్చేవరకు ఆరబెట్టాలని తెలిపారు. ఆతని వెంట వ్యవసాయ అధికారి లావణ్య వ్యవసాయ విస్తరణ అధికారి గజనంద్ ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు