Forest Land : అటవీ భూమి కబ్జాకు యత్నం.. ఫిర్యాదు చేసిన ఫారెస్ట్ ఆఫీసర్..!
Forest Land : అటవీ భూమి కబ్జాకు యత్నం.. ఫిర్యాదు చేసిన ఫారెస్ట్ ఆఫీసర్..!
కుల్కచర్ల, మన సాక్షి:
అక్రమంగా ప్రభుత్వ అటవీ ప్రాంతాలలో కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీధర్ అన్నారు. కుల్కచర్ల మండల పరిధిలోని కుసుమ సముద్రం (చెరువు ముందలి తండా) లో గస్తీ నిర్వహిస్తుండగా అదే తాండ గ్రామానికి చెందిన కేతవత్ భాష మరియు అతని కుమారులు నంద్యా నాయక్ లు అక్రమంగా అటవీ ప్రాంతంలో గృహ నిర్మాణం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం ప్రకారం వెళ్లి పరిశీలించారు.
ఇంటి నిర్మాణం చేయడం చట్టా విరుద్ధ మని ఇట్టి నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని ఆదేశించగా కేతావత్ బాషా నాయక్ అతని కుమారులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీధర్ ను నానా బూతులు తిడుతూ.. భయభ్రాంతులకు గురి చేశారని తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కుల్కచర్ల మండలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేతావత్ బాషా మరియు అతని కుమారుల పై కేసు నమోదు చేయడం జరిగిందని స్థానిక ఎస్సై రమేష్ కుమార్ అన్నారు.
MOST READ ;
-
Rythu Bharosa : రైతు భరోసా, రైతు బీమా పై కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!
-
IPL : నెరవేరిన 18 ఏళ్ల కల… ఈ సారి కప్పు ఆర్సీబీదే.. పంజాబ్పై గెలుపు..!
-
WhatsApp : వాట్సాప్ లోకి అనుకున్న సరికొత్త ఫీచర్..!
-
Fake seeds : నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్..!
-
Sleep : పగటి పూట నిద్రపోతున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!









