Breaking NewsTOP STORIESతెలంగాణ
గ్రూప్-1 అభ్యర్థులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..!
గ్రూప్-1 అభ్యర్థులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ తెలియజేశారు. గ్రూప్ వన్ ఎప్పుడు.. ఎప్పుడు అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చును. ఇప్పటికే రెండు పర్యాయాలు గ్రూప్-1 రద్దు కావడంతో ఆందోళనలో ఉన్న అభ్యర్థులకు మరింత ఊరట కలిగించే అంశం.
గ్రూప్-1 వయోపరిమితిని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గ్రూప్-1 వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచి పరీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా 15 రోజుల్లో 15 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ALSO READ : BREAKING : నల్గొండ జిల్లాలో రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి..!









