TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

Peddapalli : ఆదివారం వస్తే వారికి పండగ.. నేనే ఇన్చార్జి, ఎవరొచ్చినా.. నా పేరు చెప్పండి..!

Peddapalli : ఆదివారం వస్తే వారికి పండగ.. నేనే ఇన్చార్జి, ఎవరొచ్చినా.. నా పేరు చెప్పండి..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి ప్రతినిధి :

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని చుట్టుపక్కల గ్రామాలకు .అక్రమ ఇసుక దందా ముఠా ఆదివారం నాడు 15 ట్రాక్టర్ల ఇసుక రోడ్లపై దర్జాగా నడుస్తున్నాయి. ఆదివారం వస్తే ఇసుక దందా నిర్వహించే వారికి పండుగ. సంబంధిత అధికారులు ఆదివారం సెలవు అవడం తో రెచ్చిపోయిన ఇసుక దందా ముఠా ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు ఈ యొక్క ఇసుక దందా ముఠా తో కొంతమంది అధికారుల కను సలిగెలతో ఇసుక దందా రెచ్చిపోతుంది.

చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ఈ ఇసుక దందా ముఠాకు అమాయకులు బలి అవుతున్నారు. అత్యవసరం బట్టి ఈ యొక్క ఇసుక రేటు నాలుగు వేల నుండి 5వేల వరకు ఉంటుంది. ఈ మధ్యనే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  ఆన్లైన్ బుకింగ్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినారు.

కానీ ఆన్లైన్ బుకింగ్ చేయకుండానే ధర్మారానికి చెందిన ఒక వ్యక్తి ఇసుక దందా చేస్తూ గత కొన్ని సంవత్సరాల నుండి నడుస్తుంది. అతడు 3 మండలాలూ నాదే ఇన్చార్జి ఎవరు ట్రక్టర్లను ఆపి అడిగినా నా పేరు చెప్పండి అంటూ ఆ యొక్క ట్రాక్టర్ల ఓనర్లకు డ్రైవర్లకు మద్దతు పలుకుతూ ఆ యొక్క ట్రక్టర్ జిరో దందా కావడంతో ఊరిలో నుండి ఆ యొక్క ట్రాక్టర్ స్పీడ్ గా వెళుతూ ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవర్లకు ఫెస్సుకు కాటచీఫ్ కట్టుకొని దొంగ దండా నడుపుతున్నారు.

ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ఇసుక ట్రాక్టర్ డి కొనడం తో ఒక విలేజ్ లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో నడుస్తున్న ఈ యొక్క ట్రాక్టర్లు అతివేగంతో నడుపుతున్న డ్రైవర్లు ఈ ఇసుక దందాను అరికట్టి ఆన్లైన్ ద్వారా ఇసుక సప్లై చేసి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ను పలువురు కోరుతున్నారు.

ఈ యొక్క ఇసుక దండ ముఠాపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు