Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
TG News : మైలార్ దేవుపల్లి లో ఇన్నోవా కారు భీభత్సం.. తండ్రి, కుమారుడు మృతి..!

TG News : మైలార్ దేవుపల్లి లో ఇన్నోవా కారు భీభత్సం.. తండ్రి, కుమారుడు మృతి..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్నోవా కారు భీభత్సం సృష్టించింది. శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్ తో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న దుప్పట్లు, రగ్గులు అమ్మే దుకాణంలో నిద్రిస్తున్న తండ్రి కుమారుల మీదికి దూసుకెళ్ళింది.
ప్రమాదంలో కుమారుడు దీపక్ , తండ్రి ప్రభు మహరాజ్ మృతి చెందగా సోదరుడు సత్తునాథ్ కు తీవ్ర గాయాలు అవ్వడం తో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారు అయినట్లు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.










