Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా

కొంగాల వాటర్ ఫాల్స్ లో వ్యక్తి గల్లంతు.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు..!

కొంగాల వాటర్ ఫాల్స్ లో వ్యక్తి గల్లంతు.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు..!

ములుగు, మన సాక్షి ప్రతినిధి

ములుగు జిల్లా వాజేడు మండల పరిధి లోని కొంగాల వాటర్ ఫాల్స్ లో వ్యక్తి గల్లంతైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కొంగాల వాటర్ ఫాల్స్ ను సంద ర్శించేందుకు అనుమతి లేనప్పటికీ కొందరు వ్యక్తులు పర్యాటకుల దగ్గర డబ్బులు తీసుకుని రహస్యంగా పంపిస్తున్నారు.

ఈ తరహాలో అక్కడికి వెళ్లిన అభినవ్(17) ఘట్కేసరి అనురాగ్ యూనివర్సిటీ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఆ వ్యక్తి కొంగల వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తూ గల్లంతు అయ్యాడు. ఇది తెలుసుకున్న స్థానిక వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ గాలింపు చర్యలు చేపట్టారు. కానీ గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదు పోలీసులు గాలింపు చర్య లు కొనసాగిస్తున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు