తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు
Miryalaguda : రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!
Miryalaguda : రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రంజాన్ వేడుకలు సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ, మండలంలోని అవంతిపురం ఈద్గా వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం మైనార్టీలకు స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ మతసామరస్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరుమర్రి కృష్ణయ్య , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, నాయకులు చిలుకూరి బాలు, శాగ జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









